భారత్ కరోనా అప్డేట్
- August 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,93,787కి చేరిందని వివరించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.93 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.70 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 88.50 కరోనా పరీక్షలు చేశారని పేర్కొంది. నిన్న 3,22,551 కరోనా పరీక్షలు చేసిననట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 211.66 కోట్లుగా ఉందని పేర్కొంది.
వాటిలో రెండో డోసులు 94.18 కోట్లు, బూస్టర్ డోసులు15.20 కోట్లుగా ఉన్నాయని చెప్పింది. నిన్న 26,53,964 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో నిన్న కూడా 10 వేల కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







