కొత్త వినోద గమ్యస్థానంగా షేక్ జాబర్ వంతెన..!
- August 29, 2022
కువైట్: కుటుంబాలు, పౌరులు, నివాసితులకు కొత్త వినోద వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో షేక్ జాబర్ వంతెనపై తాత్కాలిక కార్యకలాపాలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆలోచనగా ఉంది. అక్టోబరు నుండి మే వరకు వచ్చే శీతాకాలం, వసంత కాలంలో జాబర్ వంతెనపై రెండు కృత్రిమ ద్వీపాల నుండి ప్రయోజనం పొందాలని మంత్రివర్గ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న ప్రాజెక్టులు, మొబైల్ వాహనాలను కలిగి ఉన్న కువైట్ యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు, క్రీడా కార్యకలాపాలు, కువైట్ ఉత్పత్తుల మార్కెట్లు, మారథాన్లు.. అందుబాటులో ఉన్న ఇతర కార్యకలాపాలను నిర్వహించే ప్రతిపాదనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోనున్నది. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలతో మున్సిపాలిటీ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







