కొత్త వినోద గమ్యస్థానంగా షేక్ జాబర్ వంతెన..!
- August 29, 2022
కువైట్: కుటుంబాలు, పౌరులు, నివాసితులకు కొత్త వినోద వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో షేక్ జాబర్ వంతెనపై తాత్కాలిక కార్యకలాపాలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆలోచనగా ఉంది. అక్టోబరు నుండి మే వరకు వచ్చే శీతాకాలం, వసంత కాలంలో జాబర్ వంతెనపై రెండు కృత్రిమ ద్వీపాల నుండి ప్రయోజనం పొందాలని మంత్రివర్గ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న ప్రాజెక్టులు, మొబైల్ వాహనాలను కలిగి ఉన్న కువైట్ యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు, క్రీడా కార్యకలాపాలు, కువైట్ ఉత్పత్తుల మార్కెట్లు, మారథాన్లు.. అందుబాటులో ఉన్న ఇతర కార్యకలాపాలను నిర్వహించే ప్రతిపాదనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోనున్నది. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలతో మున్సిపాలిటీ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







