ధూమపాన నిషేధ చట్టం.. ఉల్లంఘనకు KD 5,000 జరిమానా
- September 01, 2022
కువైట్: క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధ చట్టం కేవలం పొగాకు సిగరెట్లకు మాత్రమే కాదని.. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కా (షిషా), ఇతర ఉపకరణాలకు కూడా వర్తిస్తుందని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ (ఈపీఏ) అధికారిక ప్రతినిధి షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు. పొగాకు నియంత్రణ చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈపీఏ పలు వీడియోలను రూపొందించిందని, వాటితో అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు షేఖా అల్-ఇబ్రహీం తెలిపారు. బహిరంగ ప్రదేశాల ఎంగ్రన్స్ ల వద్ద నిర్దిష్ట ప్రదేశాలలో "నో స్మోకింగ్" బోర్డులు పెట్టాలన్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఫెసిలిటీ మేనేజర్కి KD 5,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పరిపాలనా సంస్థలు, ప్రజా ప్రయోజన సంఘాలు, వాటి పరిపాలనా కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు కూడా పొగాకు నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









