ధూమపాన నిషేధ చట్టం.. ఉల్లంఘనకు KD 5,000 జరిమానా
- September 01, 2022
కువైట్: క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధ చట్టం కేవలం పొగాకు సిగరెట్లకు మాత్రమే కాదని.. ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కా (షిషా), ఇతర ఉపకరణాలకు కూడా వర్తిస్తుందని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ (ఈపీఏ) అధికారిక ప్రతినిధి షేఖా అల్-ఇబ్రహీం స్పష్టం చేశారు. పొగాకు నియంత్రణ చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈపీఏ పలు వీడియోలను రూపొందించిందని, వాటితో అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు షేఖా అల్-ఇబ్రహీం తెలిపారు. బహిరంగ ప్రదేశాల ఎంగ్రన్స్ ల వద్ద నిర్దిష్ట ప్రదేశాలలో "నో స్మోకింగ్" బోర్డులు పెట్టాలన్నారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఫెసిలిటీ మేనేజర్కి KD 5,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పరిపాలనా సంస్థలు, ప్రజా ప్రయోజన సంఘాలు, వాటి పరిపాలనా కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు కూడా పొగాకు నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







