ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం ఆర్.టీ.సీ నుంచి ఆర్డర్
- September 02, 2022
హైదరాబాద్: అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్.ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ లభించింది.వచ్చే 9 నెలల్లో బస్సులను కంపెనీ డెలివరీ చేయనుంది. అలాగే, ఐదేండ్ల పాటు బస్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయనుంది. ఈ వంద బస్సుల ఆర్డర్ విలువ రూ.151 కోట్లు.
ఈ సందర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. వి. ప్రదీప్ మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. ఈ ఆర్డర్ తో దేశం నలుమూలల మా బస్సులు నడుస్తున్నట్టు అవుతుంది. మా బస్సులు ఇప్పటికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచి కార్బన్ కాలుష్యాలను గణనీయంగా తగ్గించగలిగాయి." అని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









