ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం ఆర్.టీ.సీ నుంచి ఆర్డర్
- September 02, 2022
హైదరాబాద్: అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్.ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ లభించింది.వచ్చే 9 నెలల్లో బస్సులను కంపెనీ డెలివరీ చేయనుంది. అలాగే, ఐదేండ్ల పాటు బస్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయనుంది. ఈ వంద బస్సుల ఆర్డర్ విలువ రూ.151 కోట్లు.
ఈ సందర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. వి. ప్రదీప్ మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. ఈ ఆర్డర్ తో దేశం నలుమూలల మా బస్సులు నడుస్తున్నట్టు అవుతుంది. మా బస్సులు ఇప్పటికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచి కార్బన్ కాలుష్యాలను గణనీయంగా తగ్గించగలిగాయి." అని అన్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక