ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు అసోం ఆర్.టీ.సీ నుంచి ఆర్డర్
- September 02, 2022
హైదరాబాద్: అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కు 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ అందుకుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్.ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ లభించింది.వచ్చే 9 నెలల్లో బస్సులను కంపెనీ డెలివరీ చేయనుంది. అలాగే, ఐదేండ్ల పాటు బస్సుల మెయింటెన్స్ కూడా ఒలెక్ట్రానే చేయనుంది. ఈ వంద బస్సుల ఆర్డర్ విలువ రూ.151 కోట్లు.
ఈ సందర్బంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. వి. ప్రదీప్ మాట్లాడుతూ, "ఈశాన్య రాష్ట్రా లు, అసోం నుంచి తొలిసారిగా ఆర్డర్ రావడం సంతోషంగా ఉంది. ఈ ఆర్డర్ తో దేశం నలుమూలల మా బస్సులు నడుస్తున్నట్టు అవుతుంది. మా బస్సులు ఇప్పటికే దేశీయ రోడ్ల పై 5 కోట్ల కిలోమీటర్లకు పైగా నడిచి కార్బన్ కాలుష్యాలను గణనీయంగా తగ్గించగలిగాయి." అని అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









