బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- February 17, 2026
న్యూ ఢిల్లీ: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్ ఈ నెల నుంచి సిగరేట్ల బ్రాండ్ల ధరలు పెరిగాయి. ప్రధాన మంత్రి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత సిగరెట్ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ, సుంకాలను కేంద్రం భారీగా పెంచింది. పొగాకు ఉత్పత్తులపై సెస్లను పెంచడం వల్ల ధరలు పెరిగాయి. సిగరెట్ పొడవు, ఫిల్టర్ను బట్టి బడ్జెట్ పన్ను శ్లాబులను పొగాకు ఉత్పత్తులపై సవరించారు. ఇక వాటిపై సెస్ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారం పెరిగింది. దీంతో కంపెనీలు ఈ అదనపు ఖర్చులను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో రూ.10 విలువ చేసే సిగరెట్ రూ.13కి పెరిగింది. ఈ క్రమంలో సిగరెట్ అలవాటు ఉన్నవారికి బడ్జెట్ పెరగనుంది. ఏయే సిగరెట్ ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఫ్లేక్ కింగ్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర 70 రూపాయలు పెరిగి 240కి చేరింది. క్లాసిక్ రెగ్యులర్, మైల్డ్, ఆల్ట్రా సిగరెట్ల ధరలు 140 రూపాయలు పెరిగి 480కి చేరాయి. క్లాసిక్ కనెక్ట్ 60 రూపాయలు పెరిగి 360కి చేరగా, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ 11 రూపాయలు పెరిగి 70కి చేరింది. మొత్తం మీద ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. ధరల పెంపుతో సిగరెట్ల కొరత ఏర్పడింది. సిగరెట్ ప్రియులు తక్కువ ధర సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







