బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- February 17, 2026
న్యూ ఢిల్లీ: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్ ఈ నెల నుంచి సిగరేట్ల బ్రాండ్ల ధరలు పెరిగాయి. ప్రధాన మంత్రి మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత సిగరెట్ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ, సుంకాలను కేంద్రం భారీగా పెంచింది. పొగాకు ఉత్పత్తులపై సెస్లను పెంచడం వల్ల ధరలు పెరిగాయి. సిగరెట్ పొడవు, ఫిల్టర్ను బట్టి బడ్జెట్ పన్ను శ్లాబులను పొగాకు ఉత్పత్తులపై సవరించారు. ఇక వాటిపై సెస్ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారం పెరిగింది. దీంతో కంపెనీలు ఈ అదనపు ఖర్చులను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో రూ.10 విలువ చేసే సిగరెట్ రూ.13కి పెరిగింది. ఈ క్రమంలో సిగరెట్ అలవాటు ఉన్నవారికి బడ్జెట్ పెరగనుంది. ఏయే సిగరెట్ ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ ఫ్లేక్ కింగ్ 10 సిగరెట్ల ప్యాకెట్ ధర 70 రూపాయలు పెరిగి 240కి చేరింది. క్లాసిక్ రెగ్యులర్, మైల్డ్, ఆల్ట్రా సిగరెట్ల ధరలు 140 రూపాయలు పెరిగి 480కి చేరాయి. క్లాసిక్ కనెక్ట్ 60 రూపాయలు పెరిగి 360కి చేరగా, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ 11 రూపాయలు పెరిగి 70కి చేరింది. మొత్తం మీద ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. ధరల పెంపుతో సిగరెట్ల కొరత ఏర్పడింది. సిగరెట్ ప్రియులు తక్కువ ధర సిగరెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









