హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వివాదం..
- September 06, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వివాదం ఉద్రికత్తకు దారితీసింది. హుస్సేన్ సాగర్లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు తొమ్మిదో తేదీన హుస్సేన్ సాగర్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తామని కమిటీ తేల్చి చెప్పింది. పోలీసులు, ప్రభుత్వం తమకు సహకరించాలని.. ఎలాంటి ఉద్రిక్తత జరిగినా అందుకు ప్రభుత్వమే కారణమంటూ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనివ్వకపోతే.. ప్రగతి భవన్లో చేస్తామంటూ హెచ్చరించారు.
ఈ తరుణంలో ఈరోజు మంగళవారం గణేశ్ నిమజ్జనంపై ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ట్యాంక్బండ్పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ట్యాంక్బండ్ కు చేరుకోగా..వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుగించారు. దాంతో పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







