కువైట్ లో డెలివరీ కంపెనీలకు కొత్త గైడ్ లైన్స్
- September 06, 2022
కువైట్: డెలివరీ కంపెనీలు తమ గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డెలివరీ కంపెనీలకు కొత్తగా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. డెలివరీ వాహనం డ్రైవర్ తప్పనిసరిగా ఫుడ్ అథారిటీ జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అన్ని డెలివరీ వాహనాలు తప్పనిసరిగా వాహనంపై కంపెనీ స్టిక్కర్ను కనిపించే విధంగా అతికించాలి. డెలివరీ చేసే సమయాల్లో డ్రైవర్ యూనిఫాం ధరించాలి. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి రానున్నాయి. అధికారులు సూచనలకు కట్టుబడి ఉండాలని కంపెనీల యజమానులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గైడ్ లైన్స్ ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









