కువైట్ లో డెలివరీ కంపెనీలకు కొత్త గైడ్ లైన్స్
- September 06, 2022
కువైట్: డెలివరీ కంపెనీలు తమ గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డెలివరీ కంపెనీలకు కొత్తగా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. డెలివరీ వాహనం డ్రైవర్ తప్పనిసరిగా ఫుడ్ అథారిటీ జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అన్ని డెలివరీ వాహనాలు తప్పనిసరిగా వాహనంపై కంపెనీ స్టిక్కర్ను కనిపించే విధంగా అతికించాలి. డెలివరీ చేసే సమయాల్లో డ్రైవర్ యూనిఫాం ధరించాలి. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి రానున్నాయి. అధికారులు సూచనలకు కట్టుబడి ఉండాలని కంపెనీల యజమానులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గైడ్ లైన్స్ ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







