కువైట్ లో డెలివరీ కంపెనీలకు కొత్త గైడ్ లైన్స్
- September 06, 2022
కువైట్: డెలివరీ కంపెనీలు తమ గైడ్ లైన్స్ కు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డెలివరీ కంపెనీలకు కొత్తగా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. డెలివరీ వాహనం డ్రైవర్ తప్పనిసరిగా ఫుడ్ అథారిటీ జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అన్ని డెలివరీ వాహనాలు తప్పనిసరిగా వాహనంపై కంపెనీ స్టిక్కర్ను కనిపించే విధంగా అతికించాలి. డెలివరీ చేసే సమయాల్లో డ్రైవర్ యూనిఫాం ధరించాలి. ఈ నిబంధనలు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి రానున్నాయి. అధికారులు సూచనలకు కట్టుబడి ఉండాలని కంపెనీల యజమానులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గైడ్ లైన్స్ ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!









