నీరజ్ చోప్రా మరో రికార్డు..
- September 09, 2022
జ్యురిచ్: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించారు. మెన్స్ జావెలిన్ థ్రోలో డైమండ్ ట్రోఫీ గెలిచి, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు.
స్విట్జర్లాండ్లోని జ్యురిచ్లో గురువారం మెన్స్ జావెలిన్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్ను దాటుకుని విజేతగా నిలిచాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ థ్రో చేసి మొదటి స్థానం సంపాదించి, డైమండ్ ట్రోఫీ గెలుపొందాడు. నీరజ్ వరుసగా 84.15 మీటర్లు, 88.44 మీటర్లు, 88.00 మీటర్లు, 86.11 మీటర్లు, 87.00 మీటర్లు, 83.60 మీటర్లు జావెలిన్ థ్రో చేశారు. రెండోసారి అత్యధికంగా 88.44 మీటర్లు థ్రో చేయగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ రెండో సారి 86.94 మీటర్లు థ్రో చేశాడు. దీంతో మిగతా ఇద్దరు ఆటగాళ్లకంటే మెరుగైన ప్రదర్శన చేసి నీరజ్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.
రెండో స్థానంలో నిలిచిన వాడ్లెక్ సాధించిన అత్యధిక స్కోరు కంటే నీరజ్ మూడుసార్లు ఎక్కువ స్కోరు సాధించాడు. గత ఏడాది ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ సాధించారు. గతంలో కూడా నీరజ్ డైమండ్ లీగ్లో పాల్గొన్నాడు. 2017లో ఏడో స్థానంలో నిలవగా, 2018లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి ట్రోఫీ సాధించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







