నీరజ్ చోప్రా మరో రికార్డు..
- September 09, 2022
జ్యురిచ్: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించారు. మెన్స్ జావెలిన్ థ్రోలో డైమండ్ ట్రోఫీ గెలిచి, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు.
స్విట్జర్లాండ్లోని జ్యురిచ్లో గురువారం మెన్స్ జావెలిన్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్ను దాటుకుని విజేతగా నిలిచాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ థ్రో చేసి మొదటి స్థానం సంపాదించి, డైమండ్ ట్రోఫీ గెలుపొందాడు. నీరజ్ వరుసగా 84.15 మీటర్లు, 88.44 మీటర్లు, 88.00 మీటర్లు, 86.11 మీటర్లు, 87.00 మీటర్లు, 83.60 మీటర్లు జావెలిన్ థ్రో చేశారు. రెండోసారి అత్యధికంగా 88.44 మీటర్లు థ్రో చేయగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ రెండో సారి 86.94 మీటర్లు థ్రో చేశాడు. దీంతో మిగతా ఇద్దరు ఆటగాళ్లకంటే మెరుగైన ప్రదర్శన చేసి నీరజ్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.
రెండో స్థానంలో నిలిచిన వాడ్లెక్ సాధించిన అత్యధిక స్కోరు కంటే నీరజ్ మూడుసార్లు ఎక్కువ స్కోరు సాధించాడు. గత ఏడాది ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడల్ సాధించారు. గతంలో కూడా నీరజ్ డైమండ్ లీగ్లో పాల్గొన్నాడు. 2017లో ఏడో స్థానంలో నిలవగా, 2018లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి ట్రోఫీ సాధించారు.
తాజా వార్తలు
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!









