స్వామినారాయణ్ మందిర్ పై దాడి..
- September 15, 2022
కెనడా: కెనడాలోని టొరంటోలో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (బీఏపీఎస్) మందిర్లోని కొంత భాగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి, భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఆ ఆలయంలో జరిగిన ఈ ఘటనను కెనడాలోని భారత హై కమిషన్ ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది.
దుండగులు మందిరాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మందిర గోడలపై ఖలిస్థానీ నినాదాలు కూడా రాశారు. ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ స్పందిస్తూ మందిరంలో చోటుచేసుకున్న ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇటువంటి ద్వేషపూరిత ఘటనలను కెనడా సహించబోదని అన్నారు.
త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని అన్నారు. స్వామినారాయణ్ మందిరంలో విధ్వంసానికి పాల్పడిన ఘటనను ఖండిస్తున్నట్లు కెనాడలోని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య చెప్పారు. కెనడాలోని హిందూ ఆలయాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదని అన్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కెనడాలోని హిందువులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







