బ్రిటన్ కొత్త రాజు చార్లెస్-3తో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ
- September 19, 2022
లండన్: నేడు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే ఎలిజబెత్-2 అంత్యక్రియలలో పాల్గొనడానికి, భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముశనివారం సాయంత్రమే లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రిటన్ కొత్త రాజు చార్లెస్3తో సమావేశం అయ్యారు. లండన్లోని వెస్ట్మిన్స్టర్ అబేలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు ముందు ఆదివారం రాత్రి బకింగ్ హామ్ ప్యాలెస్లో కొత్త రాజుని ద్రౌపది కలిశారు.
కాగా, బ్రిటన్ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2కి ప్రపంచం నేడు వీడ్కోలు పలుకనుంది. 96 ఏళ్ల ఎలిజబెత్2 ఈనెల 8న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. విదేశీ రాజ కుటుంబీకులు, ప్రపంచ నాయకులు రాణి కుటుంబంతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే లండన్ చేరుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మా న్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరవుతున్న ప్రముఖుల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం