భారత్ కరోనా అప్డేట్
- September 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో గడిచి 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2,95,894 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 89.20 కోట్లు టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతుందన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు 216.83కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







