ఫీజు చెల్లించలేదని క్లయింట్ పై దావా వేసిన లాయర్
- September 21, 2022
యూఏఈ: ఫీజు చెల్లించలేదని క్లయింట్ పైనే లాయర్ దావా వేసిన వింత సంఘటన యూఏఈ లో జరిగింది. ఈ దావా కు సంబంధించి లాయర్ కు అనుకూలంగా తీర్పు రావటం విశేషం. లాయర్ ఫీజుతో పాటు డాక్యుమెంట్స్ కు అయిన ఖర్చులన్నీ చెల్లించాలని అల్ ఐన్ కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే ఓ మహిళ తన కేసు వాదించేందుకు లాయర్ ను పెట్టుకుంది. ముందుగానే ఫీజు, డాక్యుమెంటేషన్ ఖర్చు ఇస్తానని లాయర్ కు హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించింది. దీంతో సదరు లాయర్ తీవ్రంగా హార్ట్ అయ్యాడు. ఏకంగా తన క్లయింట్ నే కోర్టుకు ఇడ్చాడు. ఫీజు కు సంబంధించి ఓప్పంద పత్రం, కేసు వాదనల కాపీలను కోర్టు ముందుంచాడు. తనకు క్లయింట్ నుంచి 17, 950 దిర్హామ్ లు రావాలని కోర్టుకు చెప్పాడు. దీంతో ఆ మహిళను న్యాయస్థానం మందలించింది. ఒప్పందం ప్రకారం లాయర్ కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన









