ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- June 13, 2026
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్లోని భారత రాయబార కార్యాలయం 'బ్లడ్ డోనర్స్ కేరళ' (BDK) మరియు 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్' (FID) సహకారంతో అదాన్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి మరియు అల్ అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ షేక్ హమూద్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా రక్తదానం చేసి, ఈ మానవతా కార్యక్రమానికి తన మద్దతును తెలియజేశారు.
ఈ రక్తదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 500 మందికి పైగా ప్రజలు బ్లడ్ డొనేషన్ చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 200 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది భారత్ మరియు కువైట్ మధ్య ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు భారతీయ సమాజం అందిస్తున్న నిరంతర సహకారాన్ని చాటిచెప్పిందని వక్తలు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







