తమిళ సినిమా తారలు క్రికెట్‌ ఆడి సందడి చేశారు

- April 18, 2016 , by Maagulf
తమిళ సినిమా తారలు క్రికెట్‌ ఆడి సందడి చేశారు

చె న్నైలో ఆదివారం తమిళ సినిమా తారలు క్రికెట్‌ ఆడి సందడి చేశారు. దక్షిణ భారత నటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధులు సమీకరించడానికి ఈ తారల క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ మ్యాచ్‌లను ప్రముఖ కథానాయకులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ టాస్‌ వేసి ప్రారంభించారు. సూర్య, విశాల్‌, కార్తి, జయం రవి, విజయ్‌ సేతుపతి, జీవా, శివ కార్తికేయన్‌, ఆర్య నాయకత్వంలోని ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించడానికి దక్షిణాది సినిమా తారలు తరలివచ్చారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, శ్రీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌, శివాజీ రాజా, రానా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com