అప్పుడు ‘సుల్తాన్’.! ఇప్పుడు ‘జపాన్’.! కార్తీతో రష్మిక ఈ సారైనా వర్కవుట్ అవుతుందా.?
- September 28, 2022
నేషనల్ క్రష్ రష్మికా మండన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాలనూ కలిపి చుట్టేస్తోందిప్పుడు.
గతంలో కార్తి హీరోగా వచ్చిన ‘సుల్తాన్’ సినిమాతో రష్మిక తొలిసారి తమిళ తంబీల్ని పలకరించింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆ సినిమా అనుకోకుండా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తితో ఇంకోసారి స్ర్కీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోందట రష్మికా మండన్నా.
కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రష్మికా మండన్నాని హీరోయిన్గా ఎంచుకునేందుకు మంతనాలు జరుగుతున్నాయట. ఆల్ సెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జపాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.
మరి ఈసారైనా రష్మికకు కార్తీతో వర్కవుట్ అవుతుందా.? చూడాలిక. ఇదిలా వుంటే, రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం ‘గుడ్ బై’ రిలీజ్కి రెడీ అవుతోంది. అలాగే, ‘యానిమల్’ ‘మిషన్ మజ్న’ సినిమాలు కూడా త్వరలో రిలీజ్కి రెడీగా వున్నాయ్. అన్నట్లు తమిళంలో విజయ్తో రష్మిక ‘వారసుడు’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ







