గాడ్ ఫాదర్ ట్రైలర్ విడుదల ...
- September 29, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్.
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక.. అన్నీ రంగులు మారతాయి..’ అని పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే.. రాష్ట్రంలోని రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ ట్రైలర్ చూపించారు. సీఎం కుర్చీ ని దక్కించుకునేందుకు ఎవరెవరు ఎలా పావులు కదుపుతున్నారు.. వాటిని బ్రహ్మ (చిరంజీవి) ఎలా అడ్డుకున్నారు అనేది ‘గాడ్ ఫాదర్’ కథగా తెలుస్తోంది.
‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’ ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. అలాగే మూవీ లో నయనతార కీలక పాత్రలో కనిపించగా.. సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. బ్రహ్మ వెనుక మా పార్టీ లేదు అని నయన్ చెప్పడం.. చిరంజీవి ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం.. పోలీసులపై తిరగబడటం.. ఖైదీ డ్రెస్సులో ఫైట్ చేయడం వంటివి ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ట్రైలర్ చివర్లో చిరంజీవి ఇంట్రెన్స్ గా నడుచుకుంటూ వస్తుండగా.. సల్మాన్ ఖాన్ అడ్డొచ్చిన రౌడీలను ఊచకోత కొస్తూ కనిపించాడు. అలానే ఇద్దరూ మెషిన్ గన్స్ తీసుకొని ఫైరింగ్ చేయడం చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే సినిమా చాల ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.
తాజా వార్తలు
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు







