భారత్ కరోనా అప్డేట్
- September 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 218.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారని చెప్పింది. వాటిలో రెండో వ్యాక్సిన్ డోసులు 94.82 కోట్లు, ప్రికాషన్ డోసులు 20.88 కోట్లు ఉన్నాయని పేర్కొంది.
నిన్న దేశంలో 21,63,248 డోసుల వ్యాక్సిన్లు వేశారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 89.47 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న దేశంలో 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







