భారత్ కరోనా అప్డేట్
- September 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 218.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారని చెప్పింది. వాటిలో రెండో వ్యాక్సిన్ డోసులు 94.82 కోట్లు, ప్రికాషన్ డోసులు 20.88 కోట్లు ఉన్నాయని పేర్కొంది.
నిన్న దేశంలో 21,63,248 డోసుల వ్యాక్సిన్లు వేశారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 89.47 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న దేశంలో 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







