భారత్ కరోనా అప్డేట్
- September 29, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని పేర్కొంది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 218.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారని చెప్పింది. వాటిలో రెండో వ్యాక్సిన్ డోసులు 94.82 కోట్లు, ప్రికాషన్ డోసులు 20.88 కోట్లు ఉన్నాయని పేర్కొంది.
నిన్న దేశంలో 21,63,248 డోసుల వ్యాక్సిన్లు వేశారని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 89.47 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న దేశంలో 3,16,916 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!