భారత అమ్ములపొదిలోకి చేరిన మరో అస్త్రం
- October 03, 2022
న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్స్ (LCH)ను సోమవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.రాజస్థాన్ జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ బేస్లో జరిగిన కార్యక్రమంలో హెలికాప్టర్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్సీహెచ్ ఇండక్షన్కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్లో మరొకటి ఉండదన్నారు.
15 హెలికాప్టర్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేయగా.. పది ఐఏఎఫ్కు, మరో ఐదు భారత సైన్యం కోసం కేటాయించనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేసింది. రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ తేలికపాటి ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్ గేరును వీటికి అమర్చారు. 5వేల మీటర్ల ఎత్తులోనూ ఈ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







