'సరైనోడు' చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌

- April 19, 2016 , by Maagulf
'సరైనోడు' చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన 'సరైనోడు' చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 22న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు చిత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్‌ సంగీతం సమకూర్చారు. మాస్‌ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com