'సరైనోడు' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్
- April 19, 2016
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'సరైనోడు' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 22న గ్రాండ్గా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు చిత్రం వర్కింగ్ స్టిల్స్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







