మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం
- October 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రమాదం సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటిలో పొగ, గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను పెట్టుకోవడం, ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం వంటి విషయాల ప్రాముఖ్యతను అధికార యంత్రాంగం సూచించింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలు వ్యాపించకుండా చూడాలని, వృద్ధులకు సహాయం చేయడం , పిల్లలు/వికలాంగులు మంటల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. అత్యవసర నంబర్ (9999) లేదా అథారిటీ యొక్క ఆపరేషన్ సెంటర్ (24343666)కి కాల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ, యూఏఈలపై డ్రోన్ దాడులను ఖండించిన ఎంపీలు..!!
- ఎన్నారైలు యూఏఈ నుండి డ్యూటీ ఫ్రీలో బంగారు నాణేలు తీసుకువెళ్లవచ్చా?
- పవిత్ర స్థలాల్లో పర్యటించిన మక్కా డిప్యూటీ ఎమిర్..!!
- ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- డిజిటల్ రిమోట్ టవర్ వ్యవస్థతో 360-డిగ్రీల కవరేజీ: ఖతార్
- కువైట్-సౌదీ రైలు మార్గానికి ఆమోదం..!!
- శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- యూఏఈలో 16 భారతీయ వీసా, కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్న అల్హింద్ గ్రూప్
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!









