మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం
- October 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు నమోదు కాలేదని తెలిపింది. ప్రమాదం సమచారం అందగానే మస్కట్ గవర్నరేట్లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు సీబ్లోని విలాయత్లోని దక్షిణ మాబిలా ప్రాంతంలోని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంటిలో పొగ, గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను పెట్టుకోవడం, ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం వంటి విషయాల ప్రాముఖ్యతను అధికార యంత్రాంగం సూచించింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలు వ్యాపించకుండా చూడాలని, వృద్ధులకు సహాయం చేయడం , పిల్లలు/వికలాంగులు మంటల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. అత్యవసర నంబర్ (9999) లేదా అథారిటీ యొక్క ఆపరేషన్ సెంటర్ (24343666)కి కాల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









