ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత
- October 11, 2022
తిరుమల: తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబోతున్నారు. గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజుల పాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటలపాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించబోమని భక్తులు దీనిని గమనించగలరని పేర్కొంది.
ఇక గ్రహణం సమయాలు… అక్టోబరు 25న సూర్యగ్రహణం- సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటలకు వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. అలాగే నవంబరు 8న చంద్రగ్రహణం- మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటలవరకు చంద్రగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







