ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత
- October 11, 2022
తిరుమల: తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబోతున్నారు. గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజుల పాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటలపాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించబోమని భక్తులు దీనిని గమనించగలరని పేర్కొంది.
ఇక గ్రహణం సమయాలు… అక్టోబరు 25న సూర్యగ్రహణం- సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటలకు వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. అలాగే నవంబరు 8న చంద్రగ్రహణం- మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటలవరకు చంద్రగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









