పెరిగిన పసిడి, వెండి ధరలు

- April 20, 2016 , by Maagulf
పెరిగిన పసిడి, వెండి ధరలు

బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,290కి చేరింది.అలాగే 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.29,185కు చేరింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా యూరోపియన్‌ ట్రేడ్‌లో ఔన్సు బంగారం ధర 1,258 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.
రూ.నలభై వేల మార్కును చేరిన వెండి బుధవారం వెండి రూ.40,000 మార్కును చేరింది. ఒక్కరోజులోనే రూ.1,615 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,290కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు పెద్దఎత్తున జరగడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com