పెరిగిన పసిడి, వెండి ధరలు
- April 20, 2016
బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,290కి చేరింది.అలాగే 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.29,185కు చేరింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా యూరోపియన్ ట్రేడ్లో ఔన్సు బంగారం ధర 1,258 అమెరికన్ డాలర్లుగా ఉంది.
రూ.నలభై వేల మార్కును చేరిన వెండి బుధవారం వెండి రూ.40,000 మార్కును చేరింది. ఒక్కరోజులోనే రూ.1,615 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,290కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు పెద్దఎత్తున జరగడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







