పెరిగిన పసిడి, వెండి ధరలు
- April 20, 2016
బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,290కి చేరింది.అలాగే 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.29,185కు చేరింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా యూరోపియన్ ట్రేడ్లో ఔన్సు బంగారం ధర 1,258 అమెరికన్ డాలర్లుగా ఉంది.
రూ.నలభై వేల మార్కును చేరిన వెండి బుధవారం వెండి రూ.40,000 మార్కును చేరింది. ఒక్కరోజులోనే రూ.1,615 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,290కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు పెద్దఎత్తున జరగడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









