కేసీఆర్ ను ఆహ్వానించిన బాలయ్య
- April 20, 2016
ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ముహుర్తం షాట్ కు బాలయ్య ఈ సందర్భంగా కేసీఆర్ ను ఆహ్వానించారు. కాగా అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమి టైటిట్ ను ఉగాదిరోజున అమరావతిలో ప్రకటించగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 22న పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను బాలయ్య ఆహ్వానించారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







