కువైట్ను విడిచిపెట్టిన 382,000 మంది ప్రవాసులు
- October 27, 2022
కువైట్: 2022 ప్రథమార్ధంలో కువైట్ జనాభా 1.8% పెరిగి 4.46 మిలియన్లకు చేరుకున్నప్పటికీ.. జనాభా ఇప్పటికీ కోవిడ్కు ముందు స్థాయి కంటే తక్కువగా ఉందని, అలాగే ప్రవాసుల సంఖ్య 11.4% తగ్గిందని నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన తాజా ఆర్థిక పరిశోధన నివేదికలో పేర్కొంది. 2022 మొదటి అర్ధ భాగంలో వచ్చేవారి సంఖ్య 2.3% పెరిగినప్పటికీ.. ప్రవాస జనాభా వార్షిక ప్రాతిపదికన 382,000 భారీ తగ్గుదల నమోదైంది. ప్రవాసులలో భారతీయులు 15% అంటే 153000 మంది, ఈజిప్షియన్లు (-9%) అంటే 58,000 మంది 2021లో అత్యధికంగా తగ్గిన వారి జాబితాలో టాప్ లో ఉన్నారు. దీంతో మొత్తం జనాభాలో భారతీయుల వాటా 2019లో 22% నుండి 19%కి పడిపోయింది. ఈజిప్షియన్ల వాటా కువైట్ మొత్తం జనాభాలో 15% నుండి 14%కి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రైవేట్ రంగంలో కువైట్ పౌరులకు ఉద్యోగావకాశాలు పెరగడం వల్ల గత సంవత్సరంలో కువైట్ పౌరుల ఉపాధి రేట్లు(6.1%) గణనీయంగా పెరిగాయి. అయితే, జూన్ 2022లో మొత్తం ఉపాధి (గృహ కార్మికులు మినహా) 5.9% పడిపోయింది. ఇది కువైటేతర ఉద్యోగాలు తగ్గడం వల్ల అధికంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 2019 నుండి ప్రవాస జనాభా తగ్గినప్పటికీ.. ప్రవాస జనాభాలో గృహ కార్మికుల వాటా 2017లో 20% నుండి 23.6%కి పెరిగింది. నిర్మాణ, ప్రైవేట్ గృహ కార్మికులు, రిటైల్, తయారీ వంటి రంగాలు క్షీణతకు దారితీయడంతో.. తక్కువ-స్థాయి ఉద్యోగాల సంఖ్య బాగా పడిపోయిందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









