ఖతార్లో ప్రవేశానికి యాంటిజెన్, PCR పరీక్షలు రద్దు
- October 27, 2022
దోహా: ఖతార్లోని పౌరులు, నివాసితులు ఇకపై ఖతార్కు చేరుకున్న తర్వాత 24 గంటలలోపు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సందర్శకులు ఇకపై ఖతార్కు ప్రయాణించే ముందు కొవిడ్-19 పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితాన్ని చూపెట్టాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) వెల్లడించింది. ఖతార్లో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అక్టోబరు 26 మంత్రి మండలి నిర్ణయం మేరకు కొవిడ్ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మారిన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఖతార్లోని ఆరోగ్య సంరక్షణ ఫెసిలిటీస్ లోకి ప్రవేశించేటప్పుడు ఎహెత్రాజ్(Ehteraz) అప్లికేషన్ ద్వారా ఆరోగ్య స్థితిని ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. మరిన్ని నిబంధనల గురించి తెలుసుకునేందుకు వెబ్సైట్ను చూడాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









