ఖతార్లో ప్రవేశానికి యాంటిజెన్, PCR పరీక్షలు రద్దు
- October 27, 2022
దోహా: ఖతార్లోని పౌరులు, నివాసితులు ఇకపై ఖతార్కు చేరుకున్న తర్వాత 24 గంటలలోపు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సందర్శకులు ఇకపై ఖతార్కు ప్రయాణించే ముందు కొవిడ్-19 పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితాన్ని చూపెట్టాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) వెల్లడించింది. ఖతార్లో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అక్టోబరు 26 మంత్రి మండలి నిర్ణయం మేరకు కొవిడ్ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మారిన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఖతార్లోని ఆరోగ్య సంరక్షణ ఫెసిలిటీస్ లోకి ప్రవేశించేటప్పుడు ఎహెత్రాజ్(Ehteraz) అప్లికేషన్ ద్వారా ఆరోగ్య స్థితిని ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. మరిన్ని నిబంధనల గురించి తెలుసుకునేందుకు వెబ్సైట్ను చూడాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







