ఇండియా టూ ఖతార్: ఫిఫా ప్రపంచ కప్‌ని చూడటానికి కేరళ నుంచి సోలో ట్రిప్

- October 27, 2022 , by Maagulf
ఇండియా టూ ఖతార్: ఫిఫా ప్రపంచ కప్‌ని చూడటానికి కేరళ నుంచి సోలో ట్రిప్

ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ చూడటానికి ఐదుగురు పిల్లల తల్లి అయిన నాజీ నౌషి(33).. కేరళ నుండి ఎపిక్ సోలో ట్రిప్‌కు బయలుదేరింది. తన మహీంద్రా థార్ 4WD డ్రైవింగ్ చేస్తూ ఇండియాలో తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. 600 కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి తన వాహనాన్ని ఒమన్ తరలించి అక్కడినుంచి ఖతార్ కు ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. తన భర్త అబుధాబిలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పిన నాజీ.. ఇప్పటికే తన పిల్లలు, తల్లి యూఏఈ వెళ్లినట్లు పేర్కొంది. నాజీ ఈ సాహసయాత్రకు ముందు అనేక సోలో ట్రిప్‌లు చేసింది. లక్షద్వీప్‌, నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంపుకు నాజీ వెళ్లింది. ఆమె యూట్యూబ్ వ్లాగర్ ఛానెల్ కు దాదాపు 48K మంది ఫాలోవర్లు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com