దారుణంగా 250 మంది మహిళలను చంపిన ఇస్లామిక్స్టేట్
- April 21, 2016
ఇస్లామిక్స్టేట్.. తమ ఆగడాలతో ప్రపంచ దేశాలను గజగజలాడిస్తున్న కిరాతక ఉగ్రవాదసంస్థ అది. సాటి మనుషులన్న కనీస ధర్మాన్ని కూడా మరిచి.. అమాయక ప్రజలను వూచకోత కోస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మీడియా రిపోర్ట్.. ఐఎస్ కర్కశత్వానికి అద్దం పడుతోంది. శృంగార బానిస జీవితాలను వ్యతిరేకించినందుకు గానూ ఐఎస్ ఓ నగరానికి చెందిన 250 మంది మహిళలను అతి దారుణంగా చంపేసింది.
2014 జూన్లో ఇరాక్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మోసుల్ను ఐఎస్ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి మోసుల్ ప్రాంత మహిళలు ఒంటిరిగా బయట తిరగడానికి అనుమతి లేదు. అంతేగాక.. తమ భర్తలను ఎంచుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే.. అక్కడి మహిళలకు ఉగ్రవాదులతో తాత్కాలిక వివాహం చేసి.. శృంగార బానిసలుగా మార్చేవారు. సింగాల్ పర్వతశ్రేణుల్లో నివసించే యాజిదీ వర్గీయులపై వారు సాగించిన మారణకాండ తెలిసిందే. అలా ఒక్క 2014 ఆగస్టులోనే 500 మంది యాజిదీ మహిళలను కిడ్నాప్ చేసి.. తమ స్థావరాలకు తీసుకెళ్లారు.
ఒకవేళ ఉగ్రవాదుల నిర్ణయాన్ని గనుక వ్యతిరేకిస్తే .. ఇక వారి జీవితం అక్కడితో ఆగిపోవాల్సిందే. శృంగార బానిసత్వానికి ఒప్పుకోలేదని.. గతేడాది ఆగస్టులో ఒకేసారి 19 మంది మహిళలను ఉరితీశారు. అలా.. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 250 మంది మహిళలను చంపేసినట్లు లండన్కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో మహిళల కుటుంబసభ్యులను కూడా చంపేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







