పవన్ కల్యాణ్ పై ఎలాంటి రెక్కీ జరగలేదు..తెలంగాణ పోలీస్
- November 04, 2022
హైదరాబాద్: గత నాల్గు రోజులుగా మీడియా లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రిక్కీ వ్యవహారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఈ రిక్కీ ఫై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
పవన్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. పవన్ కల్యాణ్పై ఎలాంటి రెక్కీ కానీ, దాడికి కుట్ర గాని జరగలేదని తేల్చారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపింది ముగ్గురు యువకులు అని తెలిపారు. కారు తీయమని అడిగిన పవన్ సెక్యూరిటీతో యువకులు గొడవకు దిగారు. అయితే.. మద్యం మత్తులో గొడవ చేసినట్లు యువకులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. యువకులను విచారించి నోటీసులు ఇచ్చామని జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.
గత నెల 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు… గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరి పోలీసులు తెలిపిన దాని ప్రకారం ఈ ఇష్యూ కు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







