మౌంట్ ఎవరెస్ట్పైకి యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్
- April 22, 2016
యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీ టీమ్, ఖాట్మండూ చేరుకున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి మౌంట్ ఎవరెస్ట్పైకి వెళ్ళేందుకు ఈ టీమ్ ప్రయత్నించనుంది. టీమ్లో మొత్తం 16 మంది ఉంటారు. ఇందులో 13 మిలిటరీలో వివిధ ర్యాంకులకు చెందినవారు. అందులో ఒకరు డాక్టర్, ముగ్గురు పర్వతారోహణలో నైపుణ్యం సాధించినవారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరంగా పేరొందిన మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ టీమ్. రెండు నెలల్లో శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్వతారోహణలో భాగంగా ఈ టీమ్ అనేకరకాలైన సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచు పర్వతాల్ని అధిరోహించేటప్పుడు ఆక్సిజన్ సరైన రీతిలో అందదు. అన్ని విధాలా శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ టీమ్ పర్వతారోహణకు సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









