రియాద్లో ఒబామాని కలిసిన మొహమ్మద్
- April 22, 2016
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రియాద్లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాని రిసీవ్ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై ఇరువురు నాయకులూ చర్చించారు. గురువారం జరిగే జిసిసి - అమెరికా సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా వచ్చారు ఒబామా. ఇరు దేశాలకు సంబంధించిన విషయాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ఇరు దేశాల నేతల మధ్యా చర్చలు జరిగాయి. తీవ్రవాదం, హింస వంటి అంశాల గురించి షేక్ మొహమ్మద్, ఒబామా వద్ద ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదం పెను ప్రమాదంగా మారిందని షేక్ మొహమ్మద్, ఒబామా దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని షేక్ మొహమ్మద్, ఒబామా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







