రియాద్లో ఒబామాని కలిసిన మొహమ్మద్
- April 22, 2016
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రియాద్లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాని రిసీవ్ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై ఇరువురు నాయకులూ చర్చించారు. గురువారం జరిగే జిసిసి - అమెరికా సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా వచ్చారు ఒబామా. ఇరు దేశాలకు సంబంధించిన విషయాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ఇరు దేశాల నేతల మధ్యా చర్చలు జరిగాయి. తీవ్రవాదం, హింస వంటి అంశాల గురించి షేక్ మొహమ్మద్, ఒబామా వద్ద ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదం పెను ప్రమాదంగా మారిందని షేక్ మొహమ్మద్, ఒబామా దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని షేక్ మొహమ్మద్, ఒబామా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









