పాకిస్థాన్లో ప్రావిన్స్కు చెందిన ఓ మంత్రి దారుణ హత్య..
- April 23, 2016
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అసెంబ్లీలో సర్దార్ సోరన్ సింగ్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. సర్దార్ శుక్రవారం తన కారులో వెళ్తుండగా.. బునేర్ జిల్లాలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంత్రి కారును అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. సర్దార్ హత్యకు గురైనట్లు ప్రావిన్స్ సమాచార మంత్రి ముస్తాఖ్ ఘని ధ్రువీకరించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాలిబన్ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







