పాకిస్థాన్లో ప్రావిన్స్కు చెందిన ఓ మంత్రి దారుణ హత్య..
- April 23, 2016
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అసెంబ్లీలో సర్దార్ సోరన్ సింగ్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. సర్దార్ శుక్రవారం తన కారులో వెళ్తుండగా.. బునేర్ జిల్లాలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంత్రి కారును అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. సర్దార్ హత్యకు గురైనట్లు ప్రావిన్స్ సమాచార మంత్రి ముస్తాఖ్ ఘని ధ్రువీకరించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాలిబన్ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









