పాకిస్థాన్‌లో ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రి దారుణ హత్య..

- April 23, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లో ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రి దారుణ హత్య..

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ అసెంబ్లీలో సర్దార్‌ సోరన్‌ సింగ్‌ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. సర్దార్‌ శుక్రవారం తన కారులో వెళ్తుండగా.. బునేర్‌ జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంత్రి కారును అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్దార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సర్దార్‌ హత్యకు గురైనట్లు ప్రావిన్స్‌ సమాచార మంత్రి ముస్తాఖ్‌ ఘని ధ్రువీకరించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాలిబన్‌ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com