వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు..

- April 23, 2016 , by Maagulf
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అనైతిక రాజకీయ వ్యవహారాలపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో సమావేశమయ్యారు.ఏపీలో అధికార టీడీపీ అవినీతి, విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కోనుగోలు చేస్తున్న వ్యవహారంపై వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు తీరును గర్హిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ రోజు సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. బహిరంగ సభలు నిర్వహించి బాబు నీచ రాజకీయాలను ప్రజలకు వివరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com