భారీ అగ్నిప్రమాదం చైనాలో.....
- April 23, 2016
చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్ రసాయన కర్మాగారంలో నిన్న ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు 600 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షాంఘై, నాన్జింగ్, నాన్టాంగ్, షుజో, వుక్సి నుంచి అగ్నిమాపక దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రసాయనాలు నిల్వ ఉంచే ట్యాంకు దెబ్బతినడంతో అందులోని రసాయనాలు పరిసర ప్రాంతమంతా వ్యాపించి, మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. ప్రమాదం కారణంగా ఆయిల్ పైప్లైన్ను నిలిపివేశారు. గిడ్డంగిలో 42 ట్యాంకులు ఉండగా.. వాటిలో రెండు దగ్ధమయ్యాయని, మరో ఐదు ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ గిడ్డంగిలో 42 ట్యాంకులతో పాటు, 12 గాసోలిన్ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని వెల్లడి ంచారు. గతేడాది ఆగస్టులో టియాంజిన్ రసాయన కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా 165 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







