పుస్తక పఠనం పిల్లల హక్కు
- April 23, 2016
ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందించాలనీ, నేటి బాలలే రేపటి పౌరులు గనుక, వారికి విజ్ఞానం అందించేందుకు పుస్తకాలను వారికి చేరువ చేయాలని కలిమత్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ అభిప్రాయపడింది. వరల్డ్ బుక్ డే సందర్భంగా పిల్లలకు పుస్తకాల్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిమత్ గ్రూప్ ఫౌండర్ మరియు సీఈఓ షకిరీ బోదౌర్ బింట్ సుల్తాన్ అల్ కాసిమి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షార్జా ఎక్స్పో సెంటర్ వద్ద ఏప్రిల్ 30 నుంచి జరిగే 8వ షార్జా చిల్డ్రన్ రీడింగ్ ఫెస్టివల్ సందర్భంగా కొత్త ఫౌండేషన్ని ప్రారంభిస్తున్నట్లు షేకా బోదౌర్ చెప్పారు. పబ్లిక్ లైబ్రరీలు, రెఫ్యుజీ క్యాంపులు, అలాగే జనసాంద్రత ఎక్కువగ వఆఉండే ప్రాంతాల్లో తాము పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్న లక్ష్యంతోనే తమ సంస్థ పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









