పుస్తక పఠనం పిల్లల హక్కు

- April 23, 2016 , by Maagulf
పుస్తక పఠనం పిల్లల హక్కు

ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందించాలనీ, నేటి బాలలే రేపటి పౌరులు గనుక, వారికి విజ్ఞానం అందించేందుకు పుస్తకాలను వారికి చేరువ చేయాలని కలిమత్‌ ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఎంపవర్‌మెంట్‌ అభిప్రాయపడింది. వరల్డ్‌ బుక్‌ డే సందర్భంగా పిల్లలకు పుస్తకాల్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిమత్‌ గ్రూప్‌ ఫౌండర్‌ మరియు సీఈఓ షకిరీ బోదౌర్‌ బింట్‌ సుల్తాన్‌ అల్‌ కాసిమి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షార్జా ఎక్స్‌పో సెంటర్‌ వద్ద ఏప్రిల్‌ 30 నుంచి జరిగే 8వ షార్జా చిల్డ్రన్‌ రీడింగ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా కొత్త ఫౌండేషన్‌ని ప్రారంభిస్తున్నట్లు షేకా బోదౌర్‌ చెప్పారు. పబ్లిక్‌ లైబ్రరీలు, రెఫ్యుజీ క్యాంపులు, అలాగే జనసాంద్రత ఎక్కువగ వఆఉండే ప్రాంతాల్లో తాము పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్న లక్ష్యంతోనే తమ సంస్థ పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com