మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి
- April 23, 2016
అమెరికా టెక్నాలజీ రంగంలో దాదాపు దశాబ్దం పాటు శత్రువుల్లా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి స్వస్తి పలికి శాంతి ఒప్పందానికి వచ్చాయి. రెండు కంపెనీలు కూడా ఇక మీదట ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోబోమని తెలిపాయి. గూగుల్పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంపెనీ న్యాయపరమైన ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లీగల్ ప్రొసీడింగ్స్లో కాకుండా మెరిట్స్, ఉత్పత్తుల్లో పోటీ పడతామని గూగుల్ వెల్లడించింది.గూగుల్, మైక్రోసాఫ్ట్ల ఫిర్యాదులకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్, జర్మనీల్లో 18 కేసులు ఉన్నాయి. గత సెప్టెంబరులోనే రెండు కంపెనీలు పేటెంట్ ఉల్లంఘనలకు సంబంధించి రాజీకి వచ్చాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసిన రెగ్యులేటరీ ఫిర్యాదులన్నీ వెనక్కి తీసుకోవడానికి ఒప్పందం కుదిరినట్లు గూగుల్ స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







