ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా మత్తు మందులు పట్టివేత
- June 17, 2015
ముంబై ఎయిర్ పోర్ట్ లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. దోహా మీదుగా దార్-ఇ-సలామ్ కు భారీ ఎత్తున మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్ పట్టేశాయి. 74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్ డాగ్స్ మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు. తక్షణమే బాసిల్ ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13 కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74 కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్ డాగ్స్ టీమ్ ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









