మెగా హీరోతో కొత్త చిత్రం
- June 17, 2015
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'పటాస్' మూవీ మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా నిలవడంతో పాటు వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఇక రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడికి ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. 'పటాస్' తర్వాత అనిల్ రావిపూడి ఇంకా ఏ సినిమా మొదలు పెట్టలేదు. తన వద్ద ఉన్న స్టోరీలను పలువురు హీరోలకు చెబుతూ ఇన్నాళ్లు బిజీగా గడిపారు. ఎట్టకేలకు ఆయనకు ఓ హీరో నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. అతనెవరో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరో సాయి ధరమ్ తేజ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడితో సినిమా మొదలు పెట్టనున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. దిల్ రాజు సినిమా అంటే కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి. పూర్తి ఎంటర్టెనింగ్ సబ్జెక్టుతో సినిమా ఉంటుంది. తాజాగా అనిల్ రావిపూడి సినిమా కూడా అలానే ఉంటుందని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ను ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







