సోనూసూద్ కు అరుదైన గౌరవం...
- November 22, 2022
ముంబై: రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు. కరోనా కష్ట సమయంలో భయంతో ఉన్నవారికి తానే ధైర్యం అయ్యాడు. సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎవరు, ఎక్కడి వారు అనేది చూడకుండా అందుతున్న సోనూ సాయం చూసిన జనం అతని వద్దకు కదిలివెళుతున్నారు.
ఈ రియల్ హీరో తన సేవ కారిక్రమాలని కోవిడ్ సమయంలోనే కాదు ఆ తరువాత కూడా ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ను స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను అందిస్తున్నారు. అతని సేవ భావం చూసిన జనం అతనికి అభిమానులు అయిపోతున్నారు. కాగా సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022 వేడుకలు, సోమవారం రాత్రి తాజ్ శాంతాక్రూజ్లో జరిగిని. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ సేవా గుణాన్ని గుర్తించి అతని ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో సత్కరించింది.
ఈ అవార్డుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేతులు మీదగా సోనూ అందుకున్నాడు. ఇక సోనూసూద్ మాట్లాడుతూ.. “వెనకబడిన కుటుంబాలకి ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని అందించడమే నా లక్ష్యం. ఈరోజు సూద్ ఛారిటీ ఫౌండేషన్స్ ప్రయత్నాలకు ఇంతటి గుర్తింపు లభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ కారిక్రమానికి హేమ మాలిని, తమనా భాటియా, మధుర్ భండార్కర్ మరియు ఫరాఖాన్ సినీప్రముఖులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









