శ్రీవారి భక్తులకు అందుబాటులో టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు..
- November 27, 2022
టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు.. శ్రీవారి భక్తులకు అందుబాటులోకి..
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది.దీంతో టీటీడీ ప్రతేడాది శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.ఈ క్రమంలోనే 2023 క్యాలెండర్లు, డైరీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో విక్రయిస్తోంది. దీంతోపాటు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆలయ ఈవో పేరుతో డీడీలు పంపి డైరీలు, క్యాలెండర్లు పొందే సౌకర్యం కల్పించారు. ఇప్పటికే అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు భక్తులకు విక్రయిస్తున్నాయి.
ఒక్కో డైరీకి ఒక్కో ధర నిర్ణయించింది. పెద్ద డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120. ఇక తిరుమల క్యాలెండర్ రూ.130, టేబుల్ క్యాలెండర్ రూ.75గా నిర్ణయించారు. అయితే వీటి ధర కంటే సర్వీస్ చార్జ్ ఎక్కువగా ఉంది. ఒక్కో డైరీకి రూ.133, ఇక బల్క్లో 10 డైరీలు ఒకేసారి బుక్ చేసుకుంటే రూ.379 సర్వీస్ చార్జ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







