కొడుకు, మనవళ్లను ఇంటి నుంచి గెంటేయాలని కోర్టును ఆశ్రయించిన వ్యక్తి
- November 30, 2022
యూఏఈ: అల్ ఐన్కు చెందిన ఒక వ్యక్తి తన కొడుకు, మనవళ్లను తన ఇంటి నుండి గెంటేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం..సదరు వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాడు. కానీ తన కొడుకు, కోడలు, మనవరాళ్లతో తాత్కాలికంగా ఉండడానికి అనుమతించాడు. కొన్ని రోజులకు అద్దెకు ఇవ్వాలని ఇంటిని వెళ్లాలని కొడుకుకు చెప్పగా.. అతడు వెళ్లేందుకు నిరాకరించాడు. తన కొడుకుకి ఇప్పటికే మరొక ఇల్లు ఉందని సదరు వ్యక్తి తన దావాలో పేర్కొన్నాడు. మరోవైపు 10 సంవత్సరాల క్రితం తన తండ్రితో కుదుర్చుకున్న మౌఖిక ఒప్పందం ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం Dh320,000 మొత్తాన్ని ఇచ్చినట్లు కొడుకు కోర్టుకు తెలిపాడు. కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించాడు. అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ గతంలో కొడుకు ఆస్తిని వదిలి వెళ్లాలని తీర్పునిచ్చింది. కుమారుడు అప్పీల్స్ కోర్టులో తీర్పును సవాలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. అలాగు తన తండ్రి న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని కొడుకును కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







