కువైట్ సంచలన నిర్ణయం..
- December 03, 2022కువైట్ సిటీ: కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్లో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను బ్యాన్ చేసింది. దీనికి కారణం ఇటీవల అక్కడి ఓ స్కూల్లో జరిగిన ఒక సంఘటన. ఓ ఎలిమెంటరీ విద్యార్థి తోటి విద్యార్థిపై మెటల్ థర్మోస్తో దాడికి పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడట. ఈ ఘటన నేపథ్యంలోనే విద్యామంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట అబ్బాయిలకు మాత్రమే ఇలా ఈ వాటర్ బాటిళ్లను స్కూళ్లకు తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విద్యార్థులందరికీ (అబ్బాయిలు, అమ్మాయిలకి కూడా) అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు