కువైట్ సంచలన నిర్ణయం..
- December 03, 2022
కువైట్ సిటీ: కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్లో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను బ్యాన్ చేసింది. దీనికి కారణం ఇటీవల అక్కడి ఓ స్కూల్లో జరిగిన ఒక సంఘటన. ఓ ఎలిమెంటరీ విద్యార్థి తోటి విద్యార్థిపై మెటల్ థర్మోస్తో దాడికి పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడట. ఈ ఘటన నేపథ్యంలోనే విద్యామంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట అబ్బాయిలకు మాత్రమే ఇలా ఈ వాటర్ బాటిళ్లను స్కూళ్లకు తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విద్యార్థులందరికీ (అబ్బాయిలు, అమ్మాయిలకి కూడా) అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







