రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల..
- April 24, 2016
రెండో విడత రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సంతకం చేశారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఈ రోజు ఉదయం ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీపై ఈరోజు సంతకం చేశాన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని సీఎం చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







