కలర్స్ స్వాతి సైలెంట్గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!
- December 09, 2022
కలర్స్ ప్రోగ్రామ్తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి, వెండితెరపైనా ఆ హవా కొనసాగించింది. మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. సెలెక్టివ్గా కొన్ని సినిమాలు చేసి, హీరోయిన్గా తన సత్తా ఏంటో చూపించేసింది.
పెల్లి చేసుకుని, విదేశాల్లో సెటిలైపోయింది. ఎప్పటినుంచో కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఓ సినిమా ద్వారా కలర్స్ స్వాతి సైలెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘పంచతంత్రం’ సినిమా. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు.
ఈ రోజు అనగా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కలర్స్ స్వాతితో పాటూ, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించగా, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్లో ఈ మల్టీ టాలెంటెడ్ భామ ఎలా సత్తా చూపించబోతుందో.!
తాజా వార్తలు
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం







