కలర్స్ స్వాతి సైలెంట్గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!
- December 09, 2022
కలర్స్ ప్రోగ్రామ్తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి, వెండితెరపైనా ఆ హవా కొనసాగించింది. మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. సెలెక్టివ్గా కొన్ని సినిమాలు చేసి, హీరోయిన్గా తన సత్తా ఏంటో చూపించేసింది.
పెల్లి చేసుకుని, విదేశాల్లో సెటిలైపోయింది. ఎప్పటినుంచో కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఓ సినిమా ద్వారా కలర్స్ స్వాతి సైలెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘పంచతంత్రం’ సినిమా. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు.
ఈ రోజు అనగా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కలర్స్ స్వాతితో పాటూ, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించగా, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్లో ఈ మల్టీ టాలెంటెడ్ భామ ఎలా సత్తా చూపించబోతుందో.!
తాజా వార్తలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!







