కలర్స్ స్వాతి సైలెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!

- December 09, 2022 , by Maagulf
కలర్స్ స్వాతి సైలెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!

కలర్స్ ప్రోగ్రామ్‌తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి, వెండితెరపైనా ఆ హవా కొనసాగించింది. మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. సెలెక్టివ్‌గా కొన్ని సినిమాలు చేసి, హీరోయిన్‌గా తన సత్తా ఏంటో చూపించేసింది.
పెల్లి చేసుకుని, విదేశాల్లో సెటిలైపోయింది. ఎప్పటినుంచో కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఓ సినిమా ద్వారా కలర్స్ స్వాతి సైలెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘పంచతంత్రం’ సినిమా. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. 
ఈ రోజు అనగా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కలర్స్ స్వాతితో పాటూ, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించగా, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ మల్టీ టాలెంటెడ్ భామ ఎలా సత్తా చూపించబోతుందో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com