ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
- December 09, 2022
తెలంగాణ: ఆదిభట్ల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మధ్యాహ్నం నుంచి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు.. ఏం చేశారు.. అంటూ అమ్మాయి తరఫు బంధులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. అటు పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. నవీన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. చివరికి.. అమ్మాయి తన తండ్రి దామోదర్కి ఫోన్ చేసింది వైశాలి. తాను సిటీలోనే ఉన్నానని తెలిపిన వైశాలి.. సేఫ్గానే ఉన్నానని చెప్పింది. తన గురించి ఆందోళన చెందవద్దని చెప్పింది. దీంతో.. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆమె ఉన్న చోటును గుర్తించారు. సినిమాల్లో చూపించిన విధంగా.. హుటాహుటిన వాళ్లున్న ప్లేస్కి వెళ్లి.. కిడ్నాపర్లను పట్టుకున్నారు. వైశాలిని వాళ్ల నుంచి రక్షించారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







