ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు చిరంజీవి చిత్ర ప్రారంభోత్సవం ..
- April 25, 2016
మెగా అభిమానులకో శుభవార్త. ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా కు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరగనుంది. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆ రోజు దేవుడి పటాలపై పూజతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తం షాట్ కు కుటుంబ సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలిసింది.తన 150 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న చిరుకి... తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా కథ నచ్చడం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరా అని చర్చలు జరిగి, పలుపేర్లు తెరమీదకు వచ్చినా, చివరకు ఆ అవకాశం వీవీ వినాయక్ కే దక్కింది. గతంలో చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, చిరంజీవి 150వ చిత్రానికి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









