‘రొమాంటిక్’ భామని లైన్లో పెట్టిన రెండో ‘టిల్లుగాడు’.!
- December 15, 2022
‘డీజె టిల్లు’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఆ సినిమాకి సీక్వెల్ పనులు వేగవంతం చేశాడు హీరో సిద్దు జొన్నల గడ్డ. ఆ క్రమంలోనే షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి హీరోయిన్లు ఒక్కొక్కరుగా టిల్లుగానికి హ్యాండిస్తూ వస్తున్నారు.
మొదట్లో తొలి పార్ట్ హీరోయిన్ నేహా శెట్టినే అనుకున్నారు. కానీ, మార్చేశారు. ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి చేరింది. ఏమైందో ఏమో, ప్రాజెక్ట్ మధ్యలోనే అనుపమా తప్పుకుంది.
సిద్దు ఆటిట్యూడ్ తట్టుకోలేకే హీరోయిన్లు ఈ ప్రాజెక్టులో ఇమడలేకపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి చేరిందన్న ప్రచారం జరుగుతోంది.
పెద్ద బ్యానర్ (సితార ఎంటర్టైన్మెంట్స్), అందులోనూ క్రేజీ హీరో.. సో కేతిక శర్మకు ఇది కలిసొచ్చే ప్రాజెక్టే. కానీ వచ్చిన చిక్కల్లా.. సిద్దు జొన్నలగడ్డను తట్టుకోవడం అంత వీజీ కాదు. మరి కేతిక తట్టుకోగలదా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







