ఏపీ వాసులకు శుభవార్త...
- December 19, 2022
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. సంక్రాంతి సందర్భంగా 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ వివరాల్ని వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 6-18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. అయితే, ఛార్జీల విషయంలో మార్పు లేదని, ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు. ఈ సర్వీసుల కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. రిటర్న్ టికెట్ కూడా కలిపి బుక్ చేసుకుంటే, ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ కూడా కల్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన పలు కీలక వివరాల్ని కూడా తిరుమల రావు వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో 62 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాబోయే మార్చి వరకు కార్గో సేవల ద్వారా రూ.165 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే ఏపీలోని అన్ని బస్సుల్లోనూ టిమ్ మెషీన్లను ప్రవేశపెట్టనున్నమన్నారు. సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కూడా తొలగించడం లేదని వివరించారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీలు, అలవెన్సులు కూడా అందజేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్









