దుబాయ్ టాక్సీలకు ఇక స్మార్ట్ కెమెరాలు
- April 26, 2016
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,500 దుబాయ్ టాక్సీల చుట్టూ నిఘా నేత్ర కెమెరాలను కలిగి ఉంటుందని దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ యౌసిఫ్ అల్ ఆలీ ప్రకటించారు..ఆర్.టి.ఎ సహాయంతో టాక్సీ డ్రైవర్లు ప్రవర్తనను నియంత్రణ చేసేందుకు ఇదో ఎత్తుగడ మాత్రమే అని వివరించారు డాక్టర్ అల్ ఆలీ . అయితే ఈ కెమెరాలు డ్రైవర్ల వైపు మాత్రమె ఉంటాయని ప్రయాణీకుల గోప్యతకు ఏ మాత్రం భంగం కల్గించవని ఆయన వివరించారు. "టాక్సీ లోపల నిఘా కెమెరా డ్రైవర్ మీదనే దృష్టి సారిస్తాయని తెలియచేస్తూ, ఎవరైనా ప్రయాణీకులు టాక్సీ లోపలకు ఎక్కి కూర్చోగానే, నిఘా నేత్ర కెమెరాలు ఉన్నాయనే సమాచారం డ్రైవర్లు వారికి తెలియచేయాల్సి ఉంటుంది. ఈ కెమెరాలు 3 డి మరియు ముఖ గుర్తింపు సాంకేతికని ఇందులో అమర్చారు. "ఈ నిఘా కెమెరా డ్రైవర్ అసాధారణ ప్రవర్తన గుర్తించగలదు.అలాగే ఏదైనా ప్రమాదంలో లేదా వివాదం కేసులో సాక్ష్యం గా కెమెరా రికార్డ్ చేసిన సమాచారంను ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ కెమెరాలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వాహణా కేంద్రంకు అనుసంధానం చేయబడుతుంది. ఈ నిఘా కెమెరాలు 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిరుగుతూ వెలుపలి వైపు ఉన్న నిఘా కెమెరాలు టాక్సీ డ్రైవర్ లేదా ఇతర వాహనదారులను భాగంగా అతి సమీపం నుంచి గుర్తించడానికి వీలుగా సెన్సార్లను కలిగి ఉంటాయి
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









