దుబాయ్ టాక్సీలకు ఇక స్మార్ట్ కెమెరాలు
- April 26, 2016
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,500 దుబాయ్ టాక్సీల చుట్టూ నిఘా నేత్ర కెమెరాలను కలిగి ఉంటుందని దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ యౌసిఫ్ అల్ ఆలీ ప్రకటించారు..ఆర్.టి.ఎ సహాయంతో టాక్సీ డ్రైవర్లు ప్రవర్తనను నియంత్రణ చేసేందుకు ఇదో ఎత్తుగడ మాత్రమే అని వివరించారు డాక్టర్ అల్ ఆలీ . అయితే ఈ కెమెరాలు డ్రైవర్ల వైపు మాత్రమె ఉంటాయని ప్రయాణీకుల గోప్యతకు ఏ మాత్రం భంగం కల్గించవని ఆయన వివరించారు. "టాక్సీ లోపల నిఘా కెమెరా డ్రైవర్ మీదనే దృష్టి సారిస్తాయని తెలియచేస్తూ, ఎవరైనా ప్రయాణీకులు టాక్సీ లోపలకు ఎక్కి కూర్చోగానే, నిఘా నేత్ర కెమెరాలు ఉన్నాయనే సమాచారం డ్రైవర్లు వారికి తెలియచేయాల్సి ఉంటుంది. ఈ కెమెరాలు 3 డి మరియు ముఖ గుర్తింపు సాంకేతికని ఇందులో అమర్చారు. "ఈ నిఘా కెమెరా డ్రైవర్ అసాధారణ ప్రవర్తన గుర్తించగలదు.అలాగే ఏదైనా ప్రమాదంలో లేదా వివాదం కేసులో సాక్ష్యం గా కెమెరా రికార్డ్ చేసిన సమాచారంను ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ కెమెరాలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వాహణా కేంద్రంకు అనుసంధానం చేయబడుతుంది. ఈ నిఘా కెమెరాలు 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిరుగుతూ వెలుపలి వైపు ఉన్న నిఘా కెమెరాలు టాక్సీ డ్రైవర్ లేదా ఇతర వాహనదారులను భాగంగా అతి సమీపం నుంచి గుర్తించడానికి వీలుగా సెన్సార్లను కలిగి ఉంటాయి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







