హీరో హరనాథ్ కూతురు హఠాన్మరణం
- December 20, 2022
హైదరాబాద్: చిత్రసీమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ నటి నటులు మృతి చెందగా..తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు హరనాథ్ కుమార్తె పద్మజ రాజు(54) మంగళవారం గుండెపోటుతో మరణించారు.
ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ జీవితంపై ‘అందాల నటుడు’ అనే పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ఆవిష్కరించారు. పద్మజా రాజు భర్త జీవీజీ రాజు పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. గోదావరి చిత్రం కూడా జీవీజీ రాజు నిర్మాణంలోనే తెరకెక్కింది. పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా తన ఇంటి నుంచి మరో నిర్మాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని పద్మజా రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఆమె కన్నుమూయడం విషాదకరం.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







