అల్ వుస్తాలో నియోలిథిక్ కళాఖండాలు లభ్యం
- December 24, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని సామూహిక సమాధిలో నియోలిథిక్ కాలం నాటి కళాఖండాలు లభ్యమైనట్లు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ నుండి పురావస్తు మిషన్ సహకారంతో ఈ తవ్వకాలు నిర్వహించినట్లు పేర్కొంది. అల్ వుస్తాలోని డుక్మ్లోని నాఫున్ ప్రాంతంలోని పురావస్తు ప్రదేశంలో రెండవ సీజన్ త్రవ్వకాలలో మొదటి దశ కొనసాగుతుందన్నారు. నియోలిథిక్ యుగం నాటి సామూహిక సమాధిని తవ్వగా.. కుండలు, రాగి సేకరణలు, సౌందర్య సాధనాలను ఉంచే షెల్లతో సహా అనేక కళాఖండాలను గుర్తించినట్లు వెల్లడించింది. నఫున్ ప్రాంతంలో సుమారు 155 పురావస్తు అవశేషాలు కూడా కనుగొన్నట్లు తెలిపింది. వీటిలో రాతి శాసనాలు, సమాధులు ఉన్నాయన్నారు. మూడు రాళ్ల సమాధులు కూడా దొరికాయని, ఇవి రాళ్ల సమూహాలు, ప్రతి ఒక్కటి పిరమిడ్ ఆకారంలో మూడు నిటారుగా ఉండే రాళ్లతో కూడి ఉన్నాయన్నారు. ఇవి మతపరమైన ఆచారాలకు ఉపయోగించే వారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇనుప యుగం నాటి పురాతన వాణిజ్య మార్గాలతో ముడిపడి ఉందని కూడా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







