అల్ వుస్తాలో నియోలిథిక్ కళాఖండాలు లభ్యం
- December 24, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లోని సామూహిక సమాధిలో నియోలిథిక్ కాలం నాటి కళాఖండాలు లభ్యమైనట్లు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ నుండి పురావస్తు మిషన్ సహకారంతో ఈ తవ్వకాలు నిర్వహించినట్లు పేర్కొంది. అల్ వుస్తాలోని డుక్మ్లోని నాఫున్ ప్రాంతంలోని పురావస్తు ప్రదేశంలో రెండవ సీజన్ త్రవ్వకాలలో మొదటి దశ కొనసాగుతుందన్నారు. నియోలిథిక్ యుగం నాటి సామూహిక సమాధిని తవ్వగా.. కుండలు, రాగి సేకరణలు, సౌందర్య సాధనాలను ఉంచే షెల్లతో సహా అనేక కళాఖండాలను గుర్తించినట్లు వెల్లడించింది. నఫున్ ప్రాంతంలో సుమారు 155 పురావస్తు అవశేషాలు కూడా కనుగొన్నట్లు తెలిపింది. వీటిలో రాతి శాసనాలు, సమాధులు ఉన్నాయన్నారు. మూడు రాళ్ల సమాధులు కూడా దొరికాయని, ఇవి రాళ్ల సమూహాలు, ప్రతి ఒక్కటి పిరమిడ్ ఆకారంలో మూడు నిటారుగా ఉండే రాళ్లతో కూడి ఉన్నాయన్నారు. ఇవి మతపరమైన ఆచారాలకు ఉపయోగించే వారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇనుప యుగం నాటి పురాతన వాణిజ్య మార్గాలతో ముడిపడి ఉందని కూడా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







